
భద్రాచలం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయనకు వేదశీర్వచనం, శేషమాలికలు, ప్రసాదం, జ్ఞాపికలను దేవస్థానం తరుపున అందజేశారు. అంతకుముందు ఆయనను ఐటీసీ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో ఆయనకు పౌర సన్మానాన్ని స్థానిక జర్నలిస్టు యూనియన్ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఐ లక్ష్యాలను వివరించారు.