భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్​

భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్​

భద్రాచలం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఆర్టీఐ కమిషనర్​ పీవీ శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయనకు వేదశీర్వచనం, శేషమాలికలు, ప్రసాదం, జ్ఞాపికలను దేవస్థానం తరుపున అందజేశారు. అంతకుముందు ఆయనను ఐటీసీ గెస్ట్ హౌస్​లో జిల్లా కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్​మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో ఆయనకు పౌర సన్మానాన్ని స్థానిక జర్నలిస్టు యూనియన్​ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఐ లక్ష్యాలను వివరించారు.